డ్యామ్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్లకు తప్పిన ప్రమాదం

-

పంజాబ్: పతాన్ కోట్‌లో ఆర్మీ ఏవీయేషన్‌కు చెందిన ధృవ్ హెలికాప్టర్ రంజిత్ సాగర్ డ్యామ్‌లో కూలిపోయింది. అయితే ఇద్దరు పైలట్లు చాకచక్యంగా సురక్షితంగా బయటకు వచ్చారు. ఈత రావడంతో భారీ లోతు ఉన్న ప్రాజెక్టులో నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చారు.

 

హెలికాప్టర్ జమ్మూ రాష్ట్రం కతువా నుంచి బయల్దేరిన కాసేపటికే కూలినట్లు తెలుస్తోంది. ఆర్మీకి సంబంధిన ఆయుధాలను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి బ్లాస్టింగ్ జరగలేదని పైలట్లు తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్‌ను డ్యామ్‌లో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న ఆర్మీ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి బయల్దేరారు.

Read more RELATED
Recommended to you

Latest news