3 రాజధానులను జగన్ తెచ్చింది అందుకే: టీడీపీ

-

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 16 నెలల సిఎం వైఎస్ జగన్ పాలన అమరావతి విద్వంసంగా సాగింది అని ఆయన ఆరోపించారు. 300 రోజులుగా రైతులు పోరాడుతున్న సరే జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు అని ఆయన మండిపడ్డారు. అమరావతి రైతుల త్యాగం, పోరాటం రాష్ట్రం కోసమే అని ఆయన అన్నారు. జగన్ అసమర్థ పాలన కప్పిపుచ్చుకోవడానికి 3 రాజధానులు నాటకం అని మండిపడ్డారు.

వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా అంతిమ విజయం రైతులదే అని ఆయన స్పష్టం చేసారు. 16 నేలల వైసీపీ పాలనలో రాష్ట్ర అభవృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము ఉందా అని నిలదీశారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని 13 జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అమరావతి కి మద్దతుగా తెలుగదేశం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news