నిర్మాతకు సారీ చెప్పిన హీరో అడివిశేష్.. ఎందుకంటే?

-

టాలీవుడ్​ యంగ్​హీరో అడివి శేష్‌.. నిర్మాత సునీతను క్షమాపణ కోరారు. ‘శాకిని డాకిని’ చిత్ర ప్రీ రిలీజ్‌ వేదికపై ఆమెకు సారీ చెప్పారు. నివేదా థామస్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. సుధీర్‌ వర్మ దర్శకుడు. డి. సురేశ్‌బాబు, సునీత తాటి, హ్యూన్‌ వూ థామస్‌ కిమ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 16 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు శేష్‌, దర్శకురాలు నందిని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

శేష్‌ మాట్లాడుతూ.. “నిర్మాత సునీతగారికి సారీ చెప్పడం కోసమే నేను ఈ ఈవెంట్‌కి వచ్చా. ‘మేజర్‌’ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ఓ ఆర్టిస్ట్‌ను ఎంపిక చేశాం. కానీ, కొవిడ్‌ కారణంగా తను రాలేకపోయారు. ఆ స్థానంలో మాకు సునీత గుర్తొచ్చారు. సినిమాలోని హీరోయిన్‌ తల్లిగా నటించాలని అడిగాం. నిడివి సమస్య కారణంగా సంబంధిత సన్నివేశాలు తొలగించాం. అప్పుడు కలిసి సారీ చెబితే కొడతారేమోనన్న భయంతో ఇక్కడ చెప్తున్నా. నన్ను ఆహ్వానించినందుకు చిత్ర బృందానికి థ్యాంక్స్‌. మీ అందరినీ సెప్టెంబరు 16న థియేటర్‌లో కలుస్తా” అని అడివి శేష్‌ అన్నారు.

“అమ్మాయిలు యాక్షన్‌ చేస్తే బాగుంటుంది. ఈ సినిమాలోని పోరాటాలను నివేదా, రెజీనా ఎంజాయ్‌ చేశారు. యాక్షన్‌ ఒక్కటే కాదు ఈ ఇద్దరి మధ్య కామెడీ అద్భుతంగా ఉంది. ఇది విభిన్న కథా చిత్రం. ప్రపంచంలోనే తెలుగు ప్రేక్షకులు ది బెస్ట్‌. మంచి కథలను వారు తప్పకుండా ఆదరిస్తారు. రెజీనా ఎవరికీ తెలియకుండా ఎంతో సాయం చేస్తుంది. చాలా మంచి మనిషి. నివేదా ప్యాషన్‌ ఉన్న నటి’’ అని నందిని రెడ్డి అన్నారు. అడివి శేష్‌ ఏదైనా సినిమాకి యూనిఫామ్‌లో వెళ్తే అది సూపర్‌ హిట్‌ అవుతుందని, అదో సెంటిమెంట్‌ అని తెలియజేస్తూ తన దర్శకత్వంలో వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రీకరణను నందిని గుర్తు చేసుకున్నారు.

“ఈ సినిమా ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడే ప్రీ రిలీజ్‌ వేడుకను చేయటం సంతోషంగా ఉంది. మరోవైపు, ఎమోషనల్‌గా ఉంది. ఓ నటిగా ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. చాలామంది చేయిపట్టుకుని నడిపించారు. వారందరికీ ధన్యవాదాలు. ఓ అమ్మాయి సమస్య కోసం మరో అమ్మాయి నిలబడితే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా కాన్సెప్ట్‌. కొరియన్‌లో సూపర్‌ హిట్‌ అయిన చిత్రాన్ని ఇద్దరు హీరోలను పెట్టి రీమేక్‌గా చేయకుండా మాతో తీశారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు” అని నివేదా భావోద్వేగంగా మాట్లాడారు. “ఇంతటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడు సుధీర్‌ వర్మ చాలా యాక్టివ్‌. ఈ సినిమా విడుదలపై మేమెంతో ఆసక్తిగా ఉన్నాం. తప్పకుండా మీరూ సినిమా చూడండి” అని రెజీనా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news