Tollywood Drugs Case: నేడు ఈడీ ముందుకు హీరో తనీష్.. ప్రశ్నల వర్షం !?

-

Tollywood Drugs Case: సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇప్పటికే ప‌లువురు టాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారించింది. వారిలో డైరెక్టర్ పూరిజగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి, రవితేజ, రానా, నందు, ముమైత్ ఖాన్ ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే నేడు హీరో తనీష్ ఈడీ ఎదుట హాజరుకానున్నాడు. శుక్ర‌వారం ఉద‌యం 10 గంటలకు తనీష్ తన బ్యాంక్ స్టేట్మెంట్స్, డాక్యుమెంట్లతో రావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ విచార‌ణ‌లో ప్రధానంగా ఆర్ధిక లావాదేవీలు, డ్ర‌గ్స్ డీల‌ర్ కెల్విన్ తో ఏమైనా సంబంధాలున్నాయా? ఎప్పుడైనా కలిశారు..? డ్రగ్స్ హబ్ గా మారిన ఎఫ్ లాంజ్ పబ్ వివరాలు ఏమన్నా తెలుసా ? అలాగే డ్ర‌గ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జ‌రిగాయ‌న్న విష‌యంపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అలాగే తనీష్‌కు సంబంధించిన‌ బ్యాంకు ఖాతాల‌ను అధికారులు పరిశీలించనున్నారు.

గతంలోనూ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు తనీశ్. అయితే 2017లోనే కేసు ముగిసినా.. మళ్లీ నోటీసులు ఇవ్వడం ఆవేదన కలిగించిందన్నారు తనీశ్. డ్రగ్స్‌లో పట్టుబడిన కెల్విన్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదన్నారాయన. ఈ కేసులో చివ‌రిగా ఈ నెల 22న తరుణ్ ను ప్రశ్నించబోతున్నారు ఈడీ అధికారులు. మరో వైపు ప్రధాన నిందితుడు కెల్విన్ తో పాటు మరో ఇద్దరు నిందితులు అబ్దుల్ వాహెద్, అబ్దుల్ ఖుద్దూస్‌ని కూడా ఈడీ అధికారులు విచారించారు.

Read more RELATED
Recommended to you

Latest news