వేలానికి ప్రధాని బహుమతులు.. అక్టోబర్ 7వరకు ఛాన్స్

-

ప్రధానమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లు కొనసాగించనున్నారు. ఐతే ప్రధానికి వచ్చిన బహుమతులను వేలం వేయనున్నట్లు తెలుస్తుంది. ఏదైనా ప్రదేశాన్ని సందర్శించినపుడు అక్కడి వారు ఇచ్చిన బహుమానాలను ప్రజలకు ఇచ్చేందుకు వేలం వేయనున్నారు. ఎలక్ట్రానిక్ పద్దతిలో జరగనున్న ఈ వేలంలో ఎవ్వరైనా పాల్గొనవచ్చు. ఈ వేలంలో ప్రధాని బహుమతులు అయోధ్య రామ మందిరం, ఛార్ ధామ్ యాత్ర నమూనాలు, ఒలింపిక్స్ విజేతల సామాగ్రి, ఇంకా పెయింటింగ్స్ ఉన్నట్లు పేర్కొంది.

ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ వేలంలో పాల్గొని ప్రధాని బహుమతులను సొంతం చేసుకోవచ్చు. ఈ వేలం నుండి వచ్చిన సొమ్మును గంగానది శుద్ధి చేసేందుకు ఉద్దేశించిన నమామి గంగా మిషన్ కి వాడనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు ఈ వేలం జరగనుంది. ఆసక్తి ఉన్నవారు ప్రధాని బహుమతులను సొంతం చేసుకుని గంగానది శుద్దీకరణలో భాగం పంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news