దిగ్విజయ్ సింగ్ కు హైకోర్టులో ఊరట..

-

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో దిగ్విజయ్ సింగ్ కు నాంపల్లి కోర్టు జారీ చేసిన నాన్‌బెయిల్‌బుల్ వారెంట్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ప్రచారం నిర్వహించిన దిగ్విజయ్ ఎంఐఎం పార్టీ, అసదుద్దిన్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో  నాంపల్లి కోర్టు దిగ్విజయ్‌ సింగ్‌కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దిగ్విజయ్‌ సింగ్‌ హకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన హైకోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్‌ చేసింది.

దిగ్విజయ్ సింగ్  వ్యాఖ్యల వల్ల తమ పార్టీకి, అధినేత పరువుకు భంగం కలిగిందంటూ ఎంఐఎం పార్టీ జనరల్ సెక్రటరీ హుస్సేన్ అన్వర్ నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. అయితే దీనిపై పలుమార్లు విచారణ జరిపిన నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా దిగ్విజయ్ హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నిసార్లు పిలిచినా అతడు విచారణకు హాజరు కానందుకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news