ఆ ఇద్దరు BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

-

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. నేతలు ఎలాంటి తప్పులు చేసినా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఇద్దరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ ఇచ్చింది హైకోర్టు. మేడ్చల్, జనగామ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మరియు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

వారి ఎన్నికలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు సమాధానం చెప్పాలని తదుపరి విచారణలను జూన్ కు వాయిదా వేసింది. బ్యాంకు ఖాతా లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఎలా దాఖలు చేశారని మల్లారెడ్డి ఎన్నికలు కాంగ్రెస్ నేత వజ్రెష్ సవాలు చేశారు. జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఎన్నికపై కొమ్మూరి ప్రతాపరెడ్డి పిటిషన్ వేశారు. ఇక దీనిపై ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు జూన్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news