బండి సంజయ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. దీక్షకు దిగిన ఎంపీ !

-

ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన ఆఫీస్ కి బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో నిరాహారదీక్షకు కూర్చోవడానికి సిద్ధమైన బండి సంజయ్ దీక్ష ప్రారంభించినట్లు ప్రకటన చేసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోయారు. పార్టీ కార్యాలయంలోనే సంజయ్ దీక్షలో కూర్చున్నారు.

కార్యాలయంలో లో ఒంటరిగానే సంజయ్ దీక్షకు కూర్చున్నారు. ఎంపీ కార్యాలయం వద్ద పోలీసులు ఆయన్ని చేసిన అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇక బండి సంజయ్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసినట్టు చెబుతున్నారు. ఆయన కాల్ చేసి ఇక్కడ పరిస్థితి ఎలా ఉండనే విషయాన్ని కన్నుకున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి బండి సంజయ్ అరెస్ట్ మాత్రం తెలంగాణలో రచ్చ రేపేట్టుగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news