నీటి వివాదంపై ష‌ర్మిల ట్వీట్‌… లోట‌స్ పాండ్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌…

-

వైయస్ షర్మిల కు ఊహించని షాక్ తగిలింది. ఏపీ తెలంగాణ వివాదంపై షర్మిల తాజాగా చేసిన ట్వీట్ కు నిరసనగా…. లోటస్ పాండ్ దగ్గర ఉన్న ఆమె ఇంటి ముందు ఏపీ రైతులు ధర్నాకు దిగారు. కృష్ణా నీళ్ల విషయంలో షర్మిల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేస్తూ… ఆమె ఇంటిని ముట్టడించి ప్రయత్నం చేశారు. దీంతో లోటస్ పాండ్ దగ్గరి వైయస్ షర్మిల నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ తెలంగాణ నీటి వివాదంపై షర్మిల చేసిన వ్యాఖ్యలు రాయలసీమ రైతులకు నష్టం ఉన్నాయని ఏపీ రైతులు మండిపడ్డారు.

అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. అయితే.. షర్మిల అనుచరులు కూడా.. రైతులపై తిరగపడటంతో.. పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇటీవలే ”తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం.. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం..” అంటూ వైఎస్‌ షర్మిల ట్వీట్‌ చేశారు. దీంతో ఏపీ, తెలంగాణ రాజకీయాలు మరింత వేడేక్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news