కర్నూలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత…భారీ ఎత్తున పోలీసుల మోహరింపు !

-

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పులికొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓట్ల లెక్కింపు విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించిన మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు..ఈ లాఠీచార్జిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

police
police

పోలీసుల లాఠీచార్జి బాధితుల ఆక్రందనల నడుమనే బ్యాలెట్ బాక్సులను పత్తికొండ తరలించారు. ఇక ఈ దెబ్బతో పులికొండ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే గ్రామంలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇక నిన్న జరిగిన ఏపీ పంచాయతీ మూడో విడత ఎన్నికలలో అధికార వైసీపీ అధికభాగం సర్పంచి స్థానాలు గెలుచుకుంది. టిడీపి కూడా అ ఆశించిన మేర ఫలితాలు రాబట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక పవన్ కళ్యాణ్ జనసేన కూడా మంచి ఫిగర్ సాధించి పట్టు నిలుపుకుంది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news