Breaking : ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు

-

ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. జీవో నెంబర్ 1 పై చర్చించాలని టిడిపి నేతలు పట్టుబట్టగా…. తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో టిడిపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి… వైసిపి ఎమ్మెల్యే సుధాకర్ బాబు పరస్పరం దాడి చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. ఈ గందరగోళ పరిస్థితులలో అసెంబ్లీని స్పీకర్ సీతారాం వాయిదా వేశారు. ఇక ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని… ఇవాళ చలో అసెంబ్లీకి ఏపీలోని ప్రతిపక్షాలు పిలుపు ఇచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news