విశాఖలో ముదిరిన ప్రమాణాల రాజకీయం

-

విశాఖలో ప్రమాణాల రాజకీయం ముదిరింది. అక్రమాస్తులపై ఎమ్మెల్యే వెలగపూడి ప్రమాణం చేయాలంటూ సాయిబాబ ఫొటోతో ఆయన ఇంటికి వైసీపీ కార్యకర్తలు వెళ్ళారు. దీంతో భూకబ్జాలపై ఎంపి విజయసాయి ప్రమాణం చేయాలంటూ పోటీగా టీడీపీ కార్యకర్తలు వచ్చారు. సాయిబాబ గుడి నుంచి ఫొటో తీసుకొని వెలగపూడి నివాసానికి వెళ్లిన వైసీపీ కార్యకర్తలకి అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు ఎదురుపడడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.

ఇక ఈ అంశం మీద ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ నేను రమ్మన్నది విజయసాయిరెడ్డినని విజయసాయి వస్తే ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తానని అన్నారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వెలగపూడి తేల్చి చెప్పారు. దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి నేను సిద్ధం అని ఆయన అన్నారు. సాయిబాబా పాదాల వద్ద ఆరోపణలు స్టాంప్ పేపర్ పై రాసుకుని విజయసాయి రెడ్డి రావాలని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. నిరూపించకపోతే రాజ్యసభ సభ్యత్వానికి విజయ సాయి రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news