భర్తతో గొడవ..ఇంటి పక్కన వ్యక్తితో భార్య రొమాన్స్‌..చివరికీ !

-

ఈ మధ్య కాలంలో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం చాలా అడ్డదారులను ఎంచుకుని.. సంపాదించేస్తున్నారు. ఈ లిస్టులో మహిళలు కూడా ఉండటం అత్యంత దారుణం. అవును.. మహిళలు కూడా డబ్బులు కోసం.. చేయరాని పనులను చేస్తున్నారు. అచ్చం ఇలాగే.. డబ్బుల కోసం ఓ మహిళ.. పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని.. లక్షల.. లక్షల డబ్బులు కాజేసింది. తన పరువాలను చూపించి.. ఆ వ్యక్తిని బోల్తా కొట్టించింది. ఈ సంఘటన రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. వారికి ఓ కూతురు కూడా ఉంది. వారిది పూర్తిగా మధ్య తరగతి కుటుంబం. ఓ పూట బాగా తింటే.. మరో పూట కడుపు మాడ్చుకునే బతుకులు. ఈ నేపథ్యంలోనే.. వారి ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోకి ఓ వ్యక్తి అద్దెకు దిగాడు. అతడు ప్రభుత్వ శాఖలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఇంకేముంది ఈ దంపతుల కన్ను.. ఆ ప్రభుత్వ ఉద్యోగిపై పడింది. ఎలాగైన అతని వద్ద డబ్బులు కాజేయాలని.. ప్లాన్‌ వేశారు. ఆ ఇద్దరు దంపతులు కావాలనే… గొడవ పెట్టుకుని.. వేరు కాపురం పెట్టారు.

భార్య…కూతురుతో కలిసి అదే గ్రామంలోని శివారులో అద్దెకు దిగింది. ఆమె భర్త తన సొంత ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో… ఆ ప్రభుత్వ ఉద్యోగిని వలలో పడేసింది ఆ మహిళ. తరచూ.. ప్రభుత్వ ఉద్యోగిని తన ఇంటికి పిలిపించుకుని…. అతని కామ వాంఛ తీర్చేది. ఇంకేముంది.. కోరిక తీర్చినందుకు అతని నుంచి డబ్బులు డిమాండ్‌ చేయడం మొదలు పెట్టింది ఆ యువతి. మొదట్లో తక్కువగా డిమాండ్‌ చేసి.. ఆ తర్వాత ఎక్కువగా వసూలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగి బ్యాంకు బ్యాలెన్స్‌ పూర్తిగా ఖాళీ చేసింది. ఇక ఇవ్వను అంటే…అన్నప్పటికీ.. అతన్ని ఆ భార్య, భర్తలు బెదిరించే వారు. ఇక చేసేదేమీ లేక… నేరుగా పోలీసులు ఫిర్యాదు ఇచ్చాడు ఆ ప్రభుత్వం ఉద్యోగి. ఉన్న విషయం చెప్పి కంప్లైంట్‌ ఇచ్చాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news