త్వరలోనే కలుద్దామనుకున్నాం.. ఇంతలోనే ఇలా : పవన్ కళ్యాణ్

-

రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రామోజీరావు ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు తట్టుకొని నిలబడ్డారని పేర్కొన్నారు. రామోజీరావు మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావును ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి కలుద్దాం అనుకున్నానని, ఈలోపే ఇలా జరిగిందని పవన్ ఎమోషనల్ అయ్యారు.

రామోజీరావును జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు అది లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు దేవుడు అండగా నిలవాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఏపీ, తెలంగాణలో వేలాది మంది జర్నలిస్టులను రామోజీరావు అందించారని గుర్తు చేశారు. రామోజీరావు మరణంపై జనసేన తరపున సంతాపం తెలియజేస్తున్నానని పవన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news