వట్టి చేతులతో వచ్చిన ఎమ్మెల్యే సండ్ర కోట్ల రూపాయలు ఏలా పోగేశారు – మానవతారాయ్

-

సత్తుపల్లి సింగరేణి భాదితుల కోసం అమరణ నిరహర దీక్ష చేస్తున్నారు టిపిసిసి అధికార ప్రతినిధి మానవతరాయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే సండ్ర పై ఫైర్ అయ్యారు. సింగరేణి ప్రభావం తో నష్టపోతున్న కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆమరణ దీక్ష చేపట్టామని తెలిపారు. వారికి న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యే,పోలీస్ లతో కలిసి దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

నిరహర దీక్ష కోసం టెంట్ వేస్తే భగ్నం చేసేందుకు టెంట్ ను పోలిస్ స్టేషన్ కు తీసుకువెళ్ళారని అన్నారు. మండుటేండలో సైతం దీక్ష కొనసాగిస్తామన్నారు. సింగరేణి నిధుల దుర్వినియోగం అధికారులే చేశారని స్థానిక ఎమ్మెల్యే సండ్ర చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సండ్ర కు తెలియకుండా నిధులు పక్కదోవ పట్టాయా? అంటూ ప్రశ్నించారు. సింగరేణి నిధులకు సంబంధించిన విషయాలను తమకు తెలిపాడు అని సింగరేణి GM ను రాత్రికి రాత్రే బదిలీ చేయడం కరెక్ట్ కాదన్నారు.

స్థానిక ఎమ్మెల్యే కు డబ్బు మదం పట్టింది,అధికారానికి ప్రతిపక్షానికి తేడా తెలియటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వట్టిచేతులతో వచ్చిన ఎమ్మెల్యే సండ్ర కోట్ల రూపాయలను పోగేశారని అన్నారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం తమతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు ఎమ్మెల్యే కు దమ్ముందా అంటూ సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news