ఖమ్మం లో నన్ను ఎదురించే మొనగాడు ఎవడు ? – రేణుకా చౌదరి

-

ఖమ్మం లో నన్ను ఎదురించే మొనగాడు ఎవడు ..!? అంటూ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో మనస్పర్థలు ఉన్నాయని.. మర్రి శశిధర్ రెడ్డి కూల్ పర్సన్ అని తెలిపారు. నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళను బీజేపీ పక్కన పెట్టింది.. అన్ని పార్టీలలో ఇది సహజం అన్నారు రేణుకా చౌదరి.

సీనియర్ లను అవమానించే అంతటి శక్తి మాన్ ఎవరు లేరని.. కొన్ని అభిప్రాయాలు వస్తుంటాయి…పోతుంటాయి అని వెల్లడించారు రేణుకా చౌదరి. ఖమ్మం లో నన్ను ఎదుర్కునే మొనగాడు ఎవడని..ఖమ్మం పట్టణాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

మునిగోడు లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో పరిణామాలు సహజం..కొత్తేం కాదని.. అన్ని సెట్ అవుతాయని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు రేణుకా చౌదరి.

Read more RELATED
Recommended to you

Latest news