టిక్ టాక్ లో ఇద్దరితో ప్రేమ.. ఒకరి కోసం ఆరాటం.. చివరికి..?

-

ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ప్రేమలు ఎక్కువ అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. టిక్ టాక్ లో ఒక బాలుని ప్రేమించిన బాలిక చివరికి అతని చేతిలో మోసపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా పీలేరు పట్టణానికి చెందిన ఇంద్రమ్మ కుమార్తె మంజుల కడప జిల్లా మైదుకూరు కు చెందిన బ్రహ్మయ్య అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. యువకుడు తనను ప్రేమించి మోసం చేసాడు అంటు పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి. పోలీస్ విచారణ లో ఎన్నో సంచలన నిజాలు కూడా బయట పడ్డాయి.

2019లో రాజ్కుమార్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు బ్రహ్మయ్య అనే యువకుడు ప్రేమించి శారీరకంగా కలిసి ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటూ మోసం చేశాడు అంటూ యువతి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. బ్రహ్మయ్య అనే యువకుడికి ఇంకా 17 ఏళ్ళే. మేజర్ కూడా కాకపోవడం గమనార్హం. ఇక ఈ కేసు గురించి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news