శంషాబాద్ ఎయిర్​పోర్టులో భారీగా బంగారం పట్టివేత

-

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా 23 మంది వద్ద భారీ బంగారం దొరికిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. సుడాన్ నుంచి వచ్చిన 23 మంది నుంచి 14.906 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ బంగారం విలువ రూ.7.900 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో నలుగురు అరెస్టు చేశామని వెల్లడించారు. మిగిలిన వారిని విచారిస్తున్నామని చెప్పారు.

షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని వీరంతా బంగారం తరలిస్తున్నారని అధికారులు వివరించారు. అయితే వీరంతా ఒకే గ్యాంగ్​కు చెందిన వారా లేక వేర్వేరుగా బంగారం తీసుకెళ్తున్నారా అనే కోణంలో నిందితులను కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news