సికింద్రాబాద్‌లో భారీ బందోబస్తు.. ప్రయాణికుల అవస్థలు..

-

నిన్న అగ్నిపథ్‌ స్కీంకు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న ఉద్రికత్త పరిస్థితుల పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారు. స్టేషన్‌ నుంచి రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్‌ వద్ద భారీగా భద్రతను పెంచారు. ఆర్‌ఏఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, రైల్వే పోలీసులను మోహరించారు. రైల్వే స్టేషన్‌ లోపలికి వెళ్లే మార్గాల్లో భారీగా బలగాలను మోహరించారు. లోపలికి వెళ్లే ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జనం గుమికూడకుండా చూస్తున్నారు.

Hyderabad: Slowly festive rush is back on tracks

సికింద్రాబాద్‌కు వచ్చే అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కాగా, సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రావాల్సిన రైళ్లను అధికారులు నగర శివార్లలో నిలిపివేస్తున్నారు. ప్రయాణికులను శివారులోని స్టేషన్లలో దించివేస్తున్నారు. దీంతో తమ గమ్య స్థానాలకు చేరేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రయాణికులను పోలీసులు సమీప బస్టాప్‌లకు చేరుస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news