భార్య ఇంటికి రావడంలేదని భర్త చేసిన పనికి అందరూ షాక్..

-

కొందరు కొందరు.. క్షణికావేశంలో ఏం చేస్తారో వారికే తెలియదు.. కొన్ని కొన్ని సార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఆర్థిక నష్టంతో పాటు.. లేనిపోని తలనొప్పులు వచ్చి పడుతుంటాయి.. అలాంటి ఘటనే ఇది.. ప్రేమించి పెండ్లి చేసుకొన్న భార్య కాపురానికి రావట్లేదని ఓ యువకుడు సొంత కారుకే నిప్పంటించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అందుగుల శివారు లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెంది న అనూషను బసంత్‌నగర్‌కు చెందిన అర్జున్‌ సామిల్‌పాల్‌ ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకొన్నాడు.

కొంతకాలం వీరి కాపురం అన్యోన్యంగా సాగింది. అయితే ఇటీవల భార్య భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తగా అనూష పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో భార్య కాపురానికి వస్తదో రాదోననే మనోవేదనతో కొంతకాలంగా అర్జున్ బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అందుగులపల్లి శివారు పెద్దమ్మ ఆలయ సమీపంలో రోడ్డు పక్కన తన స్కార్పియోకు నిప్పు పెట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్‌ సిబ్బందితో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news