తన అన్నతో పడుకోవాలని భార్యకు భర్త వేధింపులు..!

-

మానవ సంబంధాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి అనడానికి ఈ వార్త ఒక నిదర్శనం.చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కి చెందిన పోలయ్య 2020 మర్చి 5 వ తేదీన బాధిత మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొన్నాళ్ళకే తన భార్య పై అతడు అనుమానం పెంచుకున్నాడు.నిత్యం కొడుతూ చిత్రాహింసలకు గురిచేసేవాడు. అంతే కాకుండా ఏ భర్త చెప్పని విధంగా తన అన్నతో పడుకోవాలని వేదించేవాడు.

 

 

అతని ప్రవర్తనను రెండేళ్లుగా బాధిత మహిళ భరిస్తూ వచ్చింది.అత్తా మామలకు విషయం చెప్పినా తిరిగి వారినుండి వేధింపులు ఎదురవడం తట్టుకోలేకపోయింది. రాను రాను మరింత వికృతంగా ప్రవర్తించాడు.వీటన్నిటిని మౌనంగా భరించిన బాధిత మహిళ చివరకు నిస్సహాయ స్థితిలో జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు కి “మీతో మీ ఎస్పీ -స్పందన” అనే కార్యక్రమం లో ఫిర్యాదు చేసి భాదను ఏస్పి కి వివరించి బోరున ఏడ్చింది.అతనితో బతకలేనని తనకు విడాకులు ఇప్పించి ఈ నరకయాతన నుంచి విముక్తి కల్పించాలని కోరింది.స్పందించిన ఎస్పీ వెంకటప్పల నాయుడు వేధింపులకు గురిచేస్తున్న అత్తింటి వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news