అందంగా లేవ‌ని భ‌ర్త‌ వేధింపులు.. భార్య ఆత్మ‌హ‌త్య

-

ప్రేమించి పెళ్లి చేసుకున్న‌.. భ‌ర్త అందంగా లేవ‌ని వేధించ‌డంతో భార్య తీవ్ర మ‌న‌స్థపానికి గురి అయింది. దీంతో ఉరి వేసుకుని ఆత్మ హ‌త్య చేసుకుంది. కాగ ఈ ఘ‌ట‌న రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాని తాండూర్ లో చోటు చేసుకుంది. కాగ తాండూర్ లోని జిన్ గుర్తికి చెందిన మ‌హేష్.. దేవ‌నూర్ గామ్రానికి చెందిన సునీత (23) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహం కావ‌డంతో కొన్నాళ్ల పాటు వీరి జీవితం సాఫీగా సాగిది. రెండేళ్లు గ‌డిచిన త‌ర్వాత.. ఈ జంట మ‌ధ్య విభేదాలు ప్రారంభం అయ్యాయి. సునీతను అందంగా లేవంటూ మ‌హేష్ తీవ్రంగా హింసించ‌డం మొద‌లు పెట్టాడు.

శారీరంగా, మానసికంగా సునీత‌ను ఇబ్బందులకు గురి చేశాడు. ఈ విషయాన్ని త‌ల్లి దండ్రులు, బంధువుల‌తో చెప్పినా.. లాభం లేక‌పోయింది. అలాగే ఈ మ‌ధ్య కాలంలో వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో సునీత తీవ్ర మ‌న‌స్థపానికి గురి అయింది. దీంతో ఇంట్లో త‌న చున్నీతో ఉరి వేసుకుని ఆత్మ హ‌త్య చేసుకుంది. భ‌ర్త వ‌చ్చి చూసే స‌రికి సునీత మృతి చెందింది. దీంతో సునీత కుటుంబ స‌భ్యులు.. మ‌హేష్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news