భార్య పై అనుమానం..మారుమూల ప్రదేశానికి తీసుకెళ్ళి దారుణం..!

-

కొంతకాలం తరవాత వారి స్నేహం ప్రేమ గా మారింది. ఆ తరవాత ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు అని నిశ్చయించుకున్నారు. పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు. కానీ వారి ప్రేమ ఎక్కువ కాలం నిలువలేక పోయింది. అనుమానమే పెను భూతమై కాటేసింది. ఈ ఘటన కర్ణాటక లోని శివమొగ్గ జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లాలోని ఆయనూరు కు చెందిన కౌసర్ ఫిజా అనే యువతిని అదే గ్రామానికి చెందిన షోయబ్ ప్రేమించాడు. ఆ తరవాత ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

అయితే పెళ్ళైన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ భార్యను షోయబ్ తన భార్య కౌసర్ ను దారుణంగా హత్య చేశాడు. శనివారం రాత్రి తన భార్య కౌసర్ ను తీసుకుని షోయబ్ నగరానికి దూరంగా మారుమూల ప్రదేశంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ భార్యను హత్య చేశాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు. భార్య పై అనుమానం తోనే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news