జనగామ జిల్లాలో ప్రైవేట్ బస్సులో మంటలు ; 26 మంది ప్రయాణికులు !

-

జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్‌ బస్సు లో ఒక్క సారిగా మంటలు చేలరేగాయి. అయితే… ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. డ్రైవర్‌ అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రం లోని జగ్దేపూర్‌ కు చెందిన కృష్ణా ట్రావెల్స్‌ బస్సు జనగామ జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే.. ఆ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు లో ప్రయాణిస్తున్న… 26 మంది ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. బస్సు డ్రైవర్‌ అప్రమత్తతో.. ప్రయాణికులందరూ ప్రమాదం జరుగక ముందే.. బస్సు లో నుంచి.. దిగిపోయారు.

అనంతరం… మంటలు విపరీతంగా చెలరేగడంతో.. ఆ ప్రైవేట్ ట్రావెల్‌ బస్సు పూర్తి గా దగ్ధ మైంది. ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రం లోని జగ్దేపూర్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఫైర్‌ సిబ్బంది మంటలు ఆర్పుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news