ట్విట్టర్‌కు మరో షాక్‌.. నోటీసులు జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు

-

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ మధ్య వివాదం రాజుకుంది. కొత్త ఐటీ నిబంధనలకు సంబంధించి ట్విట్టర్ కు ఇటీవల కేంద్రం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్ కు మరో షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. నటి మీరా చోప్రా కేసులో ట్విట్టర్ కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత ఏడాది జూన్ లో నటి మీరా చోప్రాపై అసభ్యకరమైన మెసేజ్ లపై కేసు నమోదు చేశారు పోలీసులు.

అప్పట్లో సైబర్ క్రైమ్ లో కేసుతో పాటు ట్విట్టర్ కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆ మెసేజ్లను డిలీట్ చేసింది ట్విటర్. అయితే ఆ మెసేజ్ లు పెట్టిన వ్యక్తి వివరాలు ఇవ్వకపోవడంతో తాజాగా మరోసారి ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసారు హైదరాబాద్ పోలీసులు. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన నోటీసులపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు. పోలీసులు ఇచ్చిన నోటీసులపై ట్విట్టర్ ఎలా స్పందిస్తుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news