Breaking : హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌.. లైన్‌ దాటితే బాదుడే

-

హైదరాబాద్‌ వాసులకు పోలీసులు షాక్‌ ఇచ్చారు. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ట్రాఫిక్ పోలీసులు స‌రికొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయ‌నున్నారు. ఇప్పటిదాకా లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ లేకున్నా, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా, మితి మీరిన వేగంతో దూసుకెళ్లినా, నో పార్కింగ్ జోన్‌లో వాహ‌నాలు నిలిపినా… జ‌రిమానాల విధించిన ట్రాఫిక్ పోలీసులు ఇక‌పై స‌రికొత్త నిబంధ‌న‌లు అమ‌లులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త నిబంధ‌న‌లు అతిక్ర‌మించినా జ‌రిమానాలు విధించే దిశగా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొత్త నిబంధ‌న‌ల్లో భాగంగా ట్రాఫిక్ సిగ్న‌ళ్ల వ‌ద్ద వాహ‌నదారులు నిర్దేశిత నిబంధ‌న‌లు పాటించాల్సిందేన‌ని ప్ర‌క‌టించారు ట్రాఫిక్ పోలీసులు. సిగ్న‌ళ్ల వ‌ద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 జ‌రిమానా విధించ‌నున్నారు ట్రాఫిక్ పోలీసులు.

Hyderabad: Over 47,000 cases booked for traffic violations

అదే స‌మ‌యంలో సిగ్న‌ళ్ల వ‌ద్ద ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే ఏకంగా రూ.1,000 జ‌రిమానా విధించ‌నున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక పాద‌చారుల‌కు అడ్డంగా వాహ‌నాలు నిలిపే వారికి రూ.600 జ‌రిమానా విధించ‌నున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఫుట్‌పాత్‌ల‌పై వ‌స్తువులు పెట్టే దుకాణ‌దారుల‌పైనా భారీగా జ‌రిమానాలు విధించేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణ‌యించారు. ఈ నిబంధ‌న‌లు ఎప్ప‌టి నుంచి అమ‌లులోకి తీసుకొస్తార‌న్న‌ది తెలియ‌రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news