హైదరాబాద్ నుండి కర్ణాటకకు టూర్ ప్యాకేజీ… ఈ ప్రదేశాలన్నీ చూసి రావచ్చు..!

-

ఈ వేసవి కి ఏదైనా టూర్ వేసేయాలి అని మీరు అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. వేసవి వినోదం కోసం అందమైన ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలను చూడాలని అనుకునే వాళ్ళ కోసం ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తీసుకు వచ్చింది. ఎంచక్కా ఈ ప్యాకేజీల తో అందమైన ప్రదేశాలన్నీ చూసి వచ్చేయచ్చు. హైదరాబాద్ నుండి కర్ణాటకకు వెళ్లే ప్రయాణికుల కోసం ‘కోస్టల్ కర్ణాటక’ పేరు తో ఓ ప్యాకేజీని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తెచ్చింది.

ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే… ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలను ఈ ప్యాకేజీ ద్వారా చూసి వచ్చేయచ్చు. ఈ కోస్టల్ కర్ణాటక ప్యాకేజీ మే నుంచి అందుబాటు లో ఉంటోంది. ఈ ప్యాకేజీ లో భాగంగా ట్రైన్ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ప్యాకేజీ ధర విషయానికి వస్తే.. రూ. 11,600 నుండి రూ. 34,270 వరకు అందుబాటులో ఉండనుంది. స్టాండర్డ్ కేటగిరీ, 3ఎసి, స్లీపర్ క్లాస్‌ వంటివి కూడా వున్నాయి. ఆరు పగలు, 5 రాత్రులు ప్యాకేజీ ఇది.

రైళ్లు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6:05 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఐక్య ఏయే ప్రదేశాలని చూడచ్చనేది చూస్తే.. మురుడేశ్వర్, మంగళూరు తీరం మీదుగా ST మేరీస్ ద్వీపం, మల్పే బీచ్, జోగ్ జలపాతం వంటివి చూడచ్చు. శ్రీ కృష్ణ ఆలయం, శారదాంబ ఆలయం, మూకాంబిక ఆలయం, గోకర్ణలోని మురుడేశ్వర్ ఆలయం, కటీల్ ఆలయం, మంగళ దేవి ఆలయం ఈ ప్యాకేజీ లో వున్నాయి. అల్పాహారం, ప్రయాణ బీమాతో సహా ఎయిర్ కండిషన్డ్ వాహనం, మూడు రాత్రుల వసతి వంటి సౌకర్యాలు వున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news