నేను చచ్చాక మీ సానుభూతి అక్కర్లేదు.. అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

-

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అతనికి బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి. ఈయన చేసే ప్రతీ సినిమాలు డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఈ తరుణంలోనే అక్షయ్ ప్రధాన పాత్రలో నటించిన ఖేల్ ఖేల్ మే అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు అక్షయ్. కొంత కాలంగా నా సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. కొంత మంది మీరేం బాధపడకండి అంతా సర్దుకుంటుంది అని చెప్పారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే. నా మీద సానుభూతి చూపించకండి. నేను ఏమి చనిపోలేదు. అసలు కమ్ బ్యాక్ ఇవ్వడానికి నేను ఎక్కడికి వెళ్లలేదు కదా.. ఇక్కడే ఉన్నాను. ఇప్పుడున్న విధంగానే నా పని కొనసాగిస్తూ ఉంటానని చెప్పాడు అక్షయ్.

Read more RELATED
Recommended to you

Latest news