మంథనిలో నాకు పోటీ లేదు – పుట్టా మధు

-

పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారంపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను సొంత పనుల కోసం మాత్రమే ఢిల్లీకి వచ్చానని చెప్పారు. పార్టీ మారుతున్నానని కొందరు తనపై ప్రచారం చేయడం బాధగా ఉందన్నారు. తాను కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తినని.. కెసిఆర్ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు జిల్లా పరిషత్ కోసం పనిచేసే అవకాశం ఇచ్చారని తెలిపారు.

మంథనిలో తనకి పోటీ లేదని.. మరోసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. తనకి పార్టీ మారే అవసరం లేదని చెప్పుకొచ్చారు. పార్టీలో తనకు గుర్తింపు ఉందన్న ఆయన.. తన పేరు చెప్పి పంచాయతీలకు కోట్ల నిధులు విడుదల చేశారని తెలిపారు. సొంత పనుల కోసం ఢిల్లీ వస్తే ప్రతిష్టను దిగజార్చేలా పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. అసలు ఢిల్లీకి రావాలంటేనే భయం వేస్తుంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news