లోకేష్ పాదయాత్రని ఆపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు – బుద్దా వెంకన్న

-

ఈనెల 27 నుండి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే ఆ పాదయాత్రని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న. లోకేష్ పాదయాత్రని అడ్డుకోవడానికి జీవో నెంబర్ 1ని తీసుకువచ్చారని అన్నారు. పోలీసులు అనుమతి ఇచ్చిన ఇవ్వకపోయినా జనవరి 27 నుండి కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం లోకేష్ పాదయాత్రకు ప్రత్యేక బలగాలు ఇవ్వాలని అన్నారు. చంద్రబాబు, లోకేష్ కి ప్రాణహాని ఉందన్నారు. పాదయాత్రకి సంబంధించి డిజిపి కి ఎప్పుడో అప్లై చేశామని.. కానీ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. లోకేష్ పాదయాత్రకి డిజిపి అనుమతులు ఇవ్వాలని కోరారు. లోకేష్ పాదయాత్రికి లక్షలాది మంది హాజరవుతారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news