శరణు కోరితే మరణ భిక్ష.. ఎదురిస్తే మరణం.. బింబిసారా ట్రైలర్ రిలీజ్..!

-

తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బింబిసార. ఆగస్ట్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సినిమా జయపజయాలతో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ఆసక్తి చూపించగలరు. ఈసారి కూడా సరికొత్తగా బింబిసారుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడానికి ఒక సినిమాతో మళ్లీ మన ముందుకు రావడం జరిగింది. అంతే కాకుండా అద్భుతమైన సినిమాలను తెరకెక్కించే నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ క్రమంలోనే పాన్ ఇండియా రేంజ్ లో బింబిసార సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో కేథరిన్ , సంయుక్తమేనన్ హీరోయిన్ లుగా నటించారు. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ జానెర్ లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణి తో పాటు చిరంతన్ బట్ తమ సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ హీరోగా , నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ తో పాటు లిరికర్ పాటలను కూడా విడుదల చేసి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా ఇప్పుడు తాజాగా కొత్త ట్రైలర్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.

సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 25 తొమ్మిదవ తేదీన హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ ఈవెంట్ కి తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ముఖ్యఅతిథిగా హాజరవుబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించినట్లు సమాచారం. ఇక ఈ కొత్త ట్రైలర్ లో హద్దులను చెరిపేస్తూ.. రాజపు సరిహద్దులను ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి శరణు కోరితే ప్రాణ భిక్ష ఎదిరిస్తే మరణం.. ఇలా డైలాగులు ట్రైలర్ కు ప్లస్ పాయింట్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగులు ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు.మొత్తానికి అయితే ఈ ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news