ఈ పండ్లు తీసుకుంటే… దగ్గు రాదు..!

-

పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పండ్లను తీసుకుంటే చాలా పోషకాలు అందుతాయి. చాలా రకాల పండ్లలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. పండ్లను తీసుకుంటే వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. చాలా మంది దగ్గుతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు దగ్గుగా ఉన్నప్పుడు ఈ పండ్లు తీసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. దగ్గు సమస్య నుండి బయటపడొచ్చు. పైనాపిల్ తీసుకుంటే చక్కటి గుణాలు పైనాపిల్లో ఉండడం వలన దగ్గు జలుబు వంటివి దూరం అవుతాయి.

ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. దగ్గుతో బాధపడే వాళ్ళు దానిమ్మ గింజల్ని కూడా తీసుకుంటూ ఉండండి. దానిమ్మ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి శరీరంలో వైరస్ లని ఇది నిర్మూలిస్తుంది. దగ్గు జలుబు ఉన్నప్పుడు దానిమ్మ రసం తీసుకుంటే వెంటనే రిలీఫ్ ఉంటుంది దగ్గు జలుబుతో బాధపడే వాళ్ళు అరటిపండును కూడా తీసుకోవచ్చు. వాంతులు వికారం సమస్య ఉంటే కూడా దూరం అవుతాయి. పొటాషియం కంటెంట్ అరటి పండ్లలో ఎక్కువ ఉంటుంది.

కివిని తీసుకుంటే కూడా దగ్గు బాగా తగ్గుతుంది. కివిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి కివితో రోగినిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. స్ట్రాబెర్రీస్ లో కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయి స్ట్రాబెర్రీ తక్కువ జలుబు ని దూరం చేయగలవు. నిమ్మ కూడా దగ్గు జలుబు వంటి వాటి నుండి ఉపశమనం ఇస్తుంది. విటమిన్ సి నిమ్మ లో ఎక్కువ ఉంటుంది. ఆపిల్స్ పుచ్చకాయని కూడా దగ్గు జలుబుతో బాధపడే వాళ్ళు తీసుకోవచ్చు ఇలా ఈ పండ్లతో ఈ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news