నాకు అవంటే పిచ్చి.. కానీ ఎవరు ఇవ్వరంటున్న సురేఖవాణి..!!

-

సీనియర్ నటి సురేఖవాణి తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈమె అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన ఫిజిక్ తో ,అందంతో ఇప్పటికీ కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉంది. ఇక తన కూతురు కంటే తనే అందంగా ఉంటుందని ఎంతోమంది పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు నెటిజెన్స్. ఇక సినిమాల విషయానికి వస్తే బ్రహ్మానందం కు జోడిగా ఎన్నో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖవాణి. ఇప్పటివరకు కొన్ని వందల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది ఈమె.

అయితే ఈ మధ్యకాలంలో మాత్రం అంతగా సినిమాలలో నటించలేదు కేవలం సోషల్ మీడియాలో పరిమితమైందని చెప్పవచ్చు. అలాంటి సమయంలోనే సురేఖవానికి స్వాతిముత్యం సినిమా ఆఫర్ రాగ ఆ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హీరోగా బెల్లంకొండ సాయి గణేష్ నటించారు. హీరోయిన్గా వర్ష భోల్లమ్మ నటించింది. ఈ సినిమాలో సురేఖ వానికి మంచి పాత్ర దక్కిందట. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్ కావడంతో సక్సెస్ మీట్ ను కూడా చిత్ర బృందం నిర్వహించింది.ఈ సందర్భంగా సురేఖవాణి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యింది.

తన సినిమాలలో నటించడం లేదని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారట. ఆ మాట విన్నప్పుడు తనకి చాలా బాధ వేస్తుందని తన సినిమాలలో ఉన్నాను మంచి ఆఫర్ల కోసమే ఎదురు చూస్తూ ఉన్నానని తెలిపింది. అంతేకాకుండా కొందరు తన వరకూ ఆఫర్లు రాకుండా చేస్తున్నారని .. అలా ఎందుకు చేస్తున్నారనే అనే విషయం తనకు తెలియదని తెలియజేసింది.ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారాయి. సినిమాలు అంటే తనకి చాలా ఇష్టమని సినిమాలలో నటించడమే జీవితమని తెలియజేసింది. సురేఖ ప్రస్తుతం మాట్లాడిన మాటలకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news