షాకింగ్: మలయాళీ భామను గదిలో బంధించిన టెలికాం సిబ్బంది

-

సినీ ఇండస్ట్రీలో నటీమణులకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. పబ్లిక్ ప్లేసుల్లో, ఈవెంట్లకు వెళ్లినప్పుడు కొందరు అసభ్యకరంగా కామెంట్లు చేయడం, తాకడం వంటివి చేస్తుంటారు. ఇటీవల సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న ఇద్దరు హీరోయిన్లకు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. తాజాగా మలయాళీ భామ అన్నా రాజన్‌కు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. సిమ్ కొనేందుకు స్టోర్‌కు వెళ్లిన అన్నా రాజన్‌ను సిబ్బందిలో గదిలో బంధించారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను విడిపించారు.

నటి అన్నా రాజన్
నటి అన్నా రాజన్

అనంతరం ఈ విషయంపై విచారణ జరిపారు. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అన్నా రాజన్ కొత్త సిమ్ కార్డు కొనేందుకు ఓ ప్రైవేట్ టెలికాం కార్యాలయానికి వెళ్లింది. ముఖానికి మాస్కు కట్టుకుని సాధారణ అమ్మాయిలా అక్కడి సిబ్బందితో మాట్లాడింది. ఇంతలో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడి సిబ్బంది ఆమెను గదిలో బంధించారు. అనంతరం ఆమె తన స్నేహితులకు ఫోన్ చేయడం.. వారు పోలీసులకు చెప్పారు. పోలీసులు షోరూంకు వచ్చి నటిని విడిపించారు. నటిని బంధించినట్లు తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news