బిఆర్ఎస్ లో కెసిఆర్ – కేటీఆర్ తప్ప మిగతా నేతలంతా జోకర్లే – బూర నర్సయ్య

-

బిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. నేడు బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్.. బడేమియా, చోటేమియాగా మారారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో వారిదే హవా నడుస్తుందని వ్యాఖ్యానించారు బూర నర్సయ్య గౌడ్. మిగతా నేతలు అంతా జోకర్లేనని అన్నారు.

బిఆర్ఎస్ నేతలు అవినీతికి అనకొండలుగా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, రైస్ మాఫియా రాజ్యమేలుతుందన్నారు బూర నర్సయ్య గౌడ్. ఎమ్మెల్యేలంతా అక్రమ సంపాదనలో పోటీ పడుతున్నారని ఆరోపించారు. త్వరలో నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామన్నారు బూర నర్సయ్య గౌడ్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేని వారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news