దారుణం : నలుగురు పిల్లలను నరికేశారు..!

-

ఈ మధ్యకాలంలో ఎన్నో నేరాలు తెరమీదికి వచ్చి అందరి వెన్నులో వణుకు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ఏకంగా నలుగురు చిన్నారులను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపిన ఘటన మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. చిన్నారులను ఇంటివద్ద వదిలేసి తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం బయటికి వెళ్లగా… పథకం ప్రకారమే నలుగురు చిన్నారులను గొడ్డలితో దారుణంగా నరికి చంపారు గుర్తు తెలియని దుండగులు. స్థానికులు రక్తపు మడుగులో ఉన్న చిన్నారులను గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. బోర్ఖేదా ప్రాంతంలో మెహతాబ్ రుమాలి దంపతులు తన నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇక ఇటీవలే కూలి పనుల నిమిత్తం ఇద్దరు దంపతులు బయటకు వెళ్ళగా నలుగురు చిన్నారులను ఇంటి వద్ద ఉంచి వెళ్లారు. కానీ పని నుండి తిరిగి వచ్చేసరికి పిల్లలు విగతజీవులుగా మారిపోయారు. గుర్తు తెలియని దుండగులు నలుగురు పిల్లలను గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news