5 కొబ్బరి కాయలు కొడితే కరోనా రాదు…!

-

కరోనా మహమ్మారి విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా సరే కొందరు పూజలు చేస్తూ కరోనా రాదని నమ్ముతున్నారు. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండటం మినహా మరొకటి లేదని చెప్తున్నా ఎవరికి తోచింది వారు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లాలో పూజలు చేస్తే కరోనా పోతుందని ఎవరో చెప్తే మహిళలు పూజలు చేసారు.

కరోనా పోవాలని అందరూ కలిసి సామూహిక పూజలు చేసారు. కరోనా మహమ్మారి వెళ్ళిపోవాలని బాసర పోచమ్మ- మహాలక్ష్మి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. 5 కొబ్బరికాయలు కొడితే మహమ్మారి రాదని మోహర్రం రోజున ఫకీరు చెప్పాడని గ్రామస్తులు మీడియాకు చెప్పారు. అమ్మవార్లకు ఐదేసి కొబ్బరికాయలు కొడుతూ పూజలు చేస్తున్న మహిళలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news