సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం…ఆ కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం

-

ఎన్నికల విధుల్లో మరణించే వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని కేసీఆర్‌ సర్కార్‌ అమాంతం పెంచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి అనుగుణంగా పరిహారాన్ని పెంచుతూ కేసీఆర్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటి వరకు గరిష్టంంగా రూ. 10 లక్షల పరిహారాన్ని అందిస్తున్నారు.

ఈ మొత్తాన్ని ఇప్పుడు కనీసం రూ.15 లక్షలకు పెంచారు. ఎన్నికల విధుల్లో ఉండి తీవ్ర వాదులు లేదా అసాంఘిక శక్తుల దుష్ట చర్యల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ఇప్పి వరకు రూ.20 లక్షలు ఇస్తున్నారు. ఆ మొత్తాన్ని రూ30 లక్షలకు పెంచారు. శాశ్వత అంగవైకల్యం ఏర్పడే వారికి ఇచ్చే మొత్తాన్ని రూ.7.50 లక్షలకు పెంచారు. ఇలాంటి సంఘటనలు జరిగితే పరిహారం ఇచ్చే అధికారాన్ని జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news