పెట్రోల్ ధరలు పెంపు… కాంగ్రెస్ పార్టీపై కిషన్ రెడ్డి ఫైర్

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే అధిక ఇంధన ధరలు, అధిక ద్రవ్యోల్భణం, సామాన్య ప్రజలపై భారం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కర్నాటకలో ఇంధన ధరలపై పన్ను పెంచడంపై కిషన్ రెడ్డి ఆదివారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు.

ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.44 ఉంటే తెలంగాణలో రూ.109.41 ఉందని అదే బీజేపీ పరిపాలిస్తున్న గుజరాత్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.44 , యూపీలో రూ.94.70, ఉత్తరాఖండ్ లో రూ. 93.82, హర్యాణాలో రూ.95.46, గోవాలో రూ.95.36 ఉందని అన్నారు. కాగా కర్నాటక ప్రభుత్వం జూన్ 15 నుంచి పెట్రోల్, డీజిల్‌పై పన్ను పెంచింది.

దీంతో ఇంధన ధరలు రూ.3 పెరిగాయి. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కర్ణాటక ప్రభుత్వం అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ తప్పుబడుతోంది. ఎన్నికలు ముగియగానే ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం భారం మోపుతోందని మండిపడింది.

Read more RELATED
Recommended to you

Latest news