IND VS SA: ధోని అరుదైన కెప్టెన్సీ రికార్డును స‌మం చేసిన రోహిత్ శ‌ర్మ‌.. విరాట్ కోహ్లీ, స‌చిన్ వ‌ల్ల కాలేదు…..

-

కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండు టెస్టులో టీమిండియా దక్షిణాఫ్రికా పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ 1-1తో స‌మ‌ము చేయడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ ను డ్రా చేసిన రెండవ ప్లేయర్ గా నిలిచాడు . అంతకుముందు మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని మాత్రమే ఈ ఘనతను సాధించాడు.

 

తాజా పర్యటనతో కలిపి ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికాలో 9సార్లు పర్యటించింది. అయితే ఈ మొత్తం పర్యటనలలో ఒక్కసారి కూడా టీమిండియా టెస్ట్ సిరీస్ ను గెలువలేకపోయింది. ఇందులో మొత్తం 7 సార్లు టెస్ట్ సిరీస్ లను చేజార్చుకోగా రెండుసార్లు మాత్రమే డ్రా గా ముగించింది.ధోనీ సారథ్యములో 2010-11లో 1-1తో, రోహిత్ కెప్టెన్సీ లో 2023-2024 ప‌ర్య‌ట‌న‌లో 1-1తో టెస్టు సిరీస్‌ల‌ను డ్రా చేసింది. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా సౌత్ ఆఫ్రికాలో టెస్టు సిరీస్ ఇండియాకు అంద‌ని ద్రాక్ష‌గానే ఉంది. మరి ఏ కెప్టెన్ ముందుగా సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెల్చుకుంటాడో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news