ఇండియా కరోనా : తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిన కేసులు

-

భారత్ లో కరోనా విజృంభణ నెమ్మదిగా తగ్గుతోందని చెప్పచ్చు. కొన్ని రోజుల పాటు కేసులు మరణాలు రెండూ తక్కువ నమోదు కావడంతో ఇక కరోనా ఎఫెక్ట్ తగ్గినట్టేనని భావించారు. కానీ మళ్ళీ నెమ్మదిగా కేసులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. అయితే నిన్న భారీగా తగ్గిన కేసులు మళ్ళీ ఈరోజు పెరిగాయి. తాజాగా నమోదయిన కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79 లక్షల 90 వేలు దాటింది. గడచిన 24 గంటలలో 43,893 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 508 మంది మృతి చెందారు.

అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 58,439గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,90,322 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 6,10,803గా ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 72,59,509కి చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,20,010కి చేరింది. ఇక దేశంలో నిన్న 10,66,786 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటిదాకా 10,54,87,680 పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news