ఇండియాలో మరింత తగ్గిన కరోనా కేసులు

-

భారత్ లో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న కేసులు, మరణాలు బాగా తగ్గాయి. అయితే నిన్నాటు కంటే ఈరోజు మళ్ళీ కేసులు తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 29,163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా వల్ల మొత్తం 449 మంది మృతి చెందారు. అలాగే గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 40,791గా ఉంది.

దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,90,370 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు  4,53,401గా ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య  82,90,370కి చేరింది. అలాగే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,30,519కి చేరింది. నిన్న ఒక్కరోజే 8,44,382 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 12,65,42,907 పరీక్షలు చేసినట్లు అయింది. అయితే రికవరీ రేటుతో పాటు దేశంలో నమోదవుతున్న కేసుల కంటే రికవరీ కేసులే ఎక్కువ కావడం ఊరట నిచ్చే అంశం అని చెప్పక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news