ఇండియాలో కొత్త‌గా 6,822 క‌రోనా కేసులు..554 రోజుల త‌ర్వాత ఇదే తొలిసారి

-

ఇండియాలో క‌రోనా కేసుల సంఖ్య ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు త‌గ్గుతూ వ‌స్తోంది. నిన్న భారీగా పెరిగిన క‌రోనా కేసులు ఇవాళ అమాంతం త‌గ్గి పోయాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం… ఇండియా లో కొత్త‌గా.. 6,822 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,48,383 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 95,014 కు చేరింది.

యాక్టివ్ కేసుల సంఖ్య ఇంత త‌క్కువగా న‌మోదు కావ‌డం 554 రోజుల త‌ర్వాత ఇదే తొలిసారి. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 220 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,73,757 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,004 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,40,79,612 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 128.76 కోట్ల‌ మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 79,39,038 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news