ఇండియాలో కొత్తగా 37,379 కరోనా కేసులు..3.24 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతూ వస్తుంది. మొన్నటి వరకు 10 వేల లోపు నమోదు అయిన కరోనా కేసులు.. ఇప్పుడు.. 30 వేలకు పైగా నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్ ప్రకారం… దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే… ఏకంగా.. 37,379 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి.

ఇక నిన్న ఒక్క రోజునే.. 124 మంది కరోనా కారణంగా మరణించారు. అలాగే.. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11,007 మంది కరోనా నుంచి పూర్తి కోలుకున్నారు. అయితే.. రోజు వారి పాజిటివిటీ రేట్‌ మాత్రం 3.24 శాతానికి పెరగడం ఆందోళనకరమైన అంశం. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,71,830 గా నమోదు అయింది. అలాగే.. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 3,43,06,414 కోలు కున్నారు. దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4,82,017 కు చేరింది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,46,70,18,464 మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చింది ఆరోగ్య శాఖ.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news