ఇండియాలో కొత్తగా 1109 కరోనా కేసులు, 43 మరణాలు నమోదు

-

మన శత్రు దేశమైన చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,109 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,33,067 కు చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,213 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,00, 002 కు చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1853888663 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 16,80,118 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 11,492 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.76 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 43 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,21,573 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news