జగన్‌ ఓ రాక్షసుడు..ఆంధ్ర ప్రదేశ్‌ ను అంధకారప్రదేశ్ గా మార్చేసాడు : నారా లోకేష్‌

-

జగన్‌ ఓ రాక్షసుడు..ఆంధ్ర ప్రదేశ్‌ ను అంధకారప్రదేశ్ గా మార్చేసారని టీడీపీ నేత నారా లోకేష్‌ నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో గత ఐదు రోజుల నుంచి కరెంట్‌ కోతలు ఉంటున్నాయి. ఇక ఇవాళ్టి నుంచి ఏపీలోని పరిశ్రమలకు పవర్‌ హాలిడేస్‌ కూడా ప్రకటించారు.

అయితే.. ఏపీ పరిస్థితులపై నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీని అంధకారప్రదేశ్ గా మార్చేసారని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు. ఒక పక్క బాదుడు…మరోపక్క కోతలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ అసమర్థ పాలన కారణంగానే.. ఏపీలో కరెంట్‌ కోతలు ఉంటున్నాయని నిప్పులు చెరిగారు లోకేష్. ఇళ్ల పట్టాల సమస్య పై పోరాడతామని….ఒకవేళ ఈ ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోతే టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు నారా లోకేష్‌. రాక్షసుడు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో జనాలు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news