ఇండియాలో కొత్తగా 6317 కరోనా, 213 ఒమిక్రాన్ కేసులు నమోదు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య పెరుగుతూ ఓరోజు తగ్గుతూ వస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 6,317 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అటు ఇండియాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 213 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,58,481 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 78,190 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.34 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 318 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,78,325 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6906 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,42,01,966 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,38,95,90,670 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 57,05,039 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news