దేశ ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఇండియాలో కొత్తగా 34 వేల కేసులు మాత్రమే నమోదు

-

మన దేశం లో కరోనా మహమ్మారి కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన ఈ మహమ్మారి కరోనా ఇప్పుడు.. వేలల్లో మాత్రమే నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 34113 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,78,882 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 93.18 శాతంగా ఉంది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,16,77,641 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,72,95,87,490 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

అలాగే ఇప్పటి వరకు 11,66,993 మందికి కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక నిన్న ఒక్క రోజే 346 మంది కరోనా తో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5,09,011 చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో.. 91930 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news