ఇండియాలో పెరిగిన కరోనా.. ఇవాళ 16,156 కేసులు

-

భారతదేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న ట్లు కనిపిస్తోంది. నిన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు… ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,156 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,31,809 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,60,989 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.11 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 733 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,56,386 కి చేరింది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,36,14,434 కు చేరింది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,04,04,99,873 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 49,09,254 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news