ఇండియాలో కొత్తగా 12,830 కరోనా కేసులు, 446 మరణాలు : 247 రోజుల తర్వాత ఇదే మొదటి సారి !

-

ఇండియాలో కరోనా కేసులు.. ఇవాళ భారీగా తగ్గాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో మన దేశంలో 12,830 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,73,300 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,59,272 కు చేరింది. 247 రోజుల తర్వాత… ఇంత తక్కువ యాక్టివ్‌ కేసుల సంఖ్య నమోదు కావడం ఇదే మొదటి సారి. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.16 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 446 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,58,186 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 14, 667 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,36,55,842 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,06,14,40,335 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news